ఏయూ వీసీ ప్రసాదరెడ్డికి అభినందనల పరంపర..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-28 18:45:50
ఆంధ్రవిశ్వదవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి అభినందన పరంపర కొనసాగుతూనే వుంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ విశాఖ చాప్టర్ సభ్యులు అభినందించారు. శనివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో చాప్టర్ చైర్మన్ ఓఆర్ఎం రావు, కార్యదర్శి జి.శ్రీధర రెడ్డి(మిలీనియం), రీజినల్ వైస్ ప్రెసిడెంట్ ఆచార్య సాంబశివ రావు, జాతీయ కమిటీ సభ్యులు డాక్టర్ మురళీధర్, శ్రీనివాస ఠాగూర్, సభ్యులు డాక్టర్ అంజన, సంతోష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం నాలుగు యూనివర్శిటీలకు ఉపకులపతిలను నియమించినప్పటికీ ఏయూ మాత్రం ఇదే యూనివర్శిటీలో రెక్టార్ గా విధులు నిర్వహించిన వ్యక్తిని వీసీగా నియమించడం అభినందనీయమన్నారు. ఆసియాలోనే పేరెన్నికగన్న ఏయూ మరింత అభివ్రుద్ధి చేయాలని వీరు ఆకాంక్షించారు.