మంత్రిపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం..గంట్ల


Ens Balu
3
Visakhapatnam
2020-11-29 13:28:48

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై ఆదివారం జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు చెప్పారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలోనూ, జర్నలిస్టులకు తనవంతు సహాయంగా నిలిచి, వారి  పక్షాన నిలిచే మంచి వ్యక్తి పేర్ని నాని కొనియాడారు. అలాంటి వ్యక్తి తన తల్లి మరణించిన బాధలోనే దినఖర్మలు చేసే సమయంలో మంత్రి పేర్నినానిపై హత్యాయత్నానికి తెగబటం దారుణమైన ఘటన అని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదేవుడి దయతో మంత్రి యత్యాయత్నం నుంచి బయటపడం ఆనందదాయకమన్నారు. మంత్రిపై జరిగిన దాడిని జర్నలిస్టుల తరపున ఖండిస్తున్నట్టు శ్రీనుబాబు చెప్పారు. సహచర జరలిస్టు సంఘాలు కూడా మంత్రిపై జరిగిన దాడిని ఖండించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు.