మంత్రిపై హత్యాయత్నం చేసింది ఇతడే..
Ens Balu
2
Machilipatnam
2020-11-29 13:35:29
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నానికి దిగిన వ్యక్తిని బడుగు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మంత్రి తన తల్లి మరణించిన తరువాత దినదశ ఖర్మలు చేసి వస్తుండగా మంత్రిపై పదునైన తాపీతో హత్యచేయడానికి తెగబడ్డాడు. అయితే అదికాస్త మంత్రి నడుకున్న బెల్టుకి తగిలి వంగిపోయింది. రెండోసారి పొడవాలని ప్రయత్నించే సమయంలోనే మంత్రి సమయస్పూర్తిగా తప్పుకున్నారు. దీంతో పక్కనే వున్న పోలీసులు, మంత్రి అనుచరులు మంత్రిని పక్కకు తప్పించారు. వెంటనే మంత్రిపై తెగబడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో..హత్యకు తెగబడ్డ వ్యక్తి బడుగు నాగేశ్వర్రావుగా గుర్తించినట్టు పోలీసులు తెలియజేశారు. ఈయనపై కేసు నమోదు చేసి పూర్తివివరాలు సేకరిస్తున్నారు పోలీసులు..