విశాఖను పరిపాలనా రాజధానిని చేయడంపట్ల హర్షం..


Ens Balu
3
2020-08-01 17:52:51

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల వైఎస్సార్సీపి ఆంధ్రాయూ నివర్శిటీ విద్యార్థి విభాగం నాయకులు బి.కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల విశాఖకు మరిన్ని అంతర్జాతీయ విద్యాసంస్థలు రావడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖ ఏర్పాటు అయిన దగ్గర్నుంచి ఉత్తరాంధ్ర ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెంద డంతో పాటు ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందు తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అందరు మేలు, అన్ని ప్రాంతాల సర్వతోమొఖాభివృద్ధి కోరి సీఎం వైయస్ జగన్ తీసుకునే నిర్ణయానికి తమ వంతు మద్దతు పూర్తిస్థాయిలో ప్రకటిస్తున్నామని కాంతారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.