ఏయూ వీసీ ప్రసాదరెడ్డికి అభినందనల వెల్లువ..


Ens Balu
2
ఆంధ్రాయూనిర్శిటీ
2020-11-29 21:18:47

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి అభినందన వెల్లువ గత మూడు రోజుల నుంచి నిరాటకంగా కొనసాగుతూనే. ఆయనను అభినందించడానికి పలువురు ప్రముఖులు వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనను కార్యాలయంలో కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం అంబేద్కర్‌ ‌విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.రాంజీ, రెల్లి కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌మధుసూధన రావు, విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌డివిఆర్‌ ‌స్టీల్‌ ఎం‌ప్లాయిస్‌ ‌యూనియన్‌ ‌సభ్యులు, పశ్చిమగోదావరికి చెందిన మాదాల రాజేష్‌ ‌తదితరులు అభినందించారు. ఎవరికీ దక్కని గౌరవం ఆచార్య పివిజిడి ప్రసాదరావుకి దక్కడంతో ఆయన సహచరులు, వివిధ యూనివర్శిటీలకు చెందిన విసిలు కూడా వచ్చి ఆయనను అభినందిస్తున్నారు. ఆంధ్రాయూనివర్శిటీ చరిత్రలో కొత్తగా నియమితులైన విసికి ఇంత స్థాయిలో అభినందనలు రావడం ఇదే తొలిసారి కావడం కూడా విశేషం..