హిందూస్థాన్ షిపియార్డులో భారీ క్రేన్ బోల్తా..11మంది దుర్మరణం


Ens Balu
2
2020-08-01 18:16:46

విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందినట్టు సమాచారంం. లోకో షెడ్ లో పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా  క్రేన్ కింద  పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే6 వ్యక్తులు మృతి చెందగా తర్వాత తీవ్ర గాయాలతో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ మృతి పట్ల ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి ఉదయం సిబ్బంది క్రేన్ ఎక్కి పనులు చేపడుతుండగా ఒక్కసారిగా క్రేన్ తిరగబడినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.