జివిఎంసీ ఈ-స్పందనకు ఆరు దరఖాస్తులు..
Ens Balu
3
జివిఎంసీ కార్యాలయం
2020-11-30 18:46:49
జివిఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంలో ప్రజల నుంచి నేరుగా కాకుండా అంతర్జాలం ద్వారా స్వీకరించిన ఈ-స్పందనకు 6 దరఖాస్తులు వచ్చాయి. సోమవారంఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ద్వారా జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన అర్జీలను పరిశీలించి పరిక్షస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఇ - స్పందన కార్యక్రమంలో పట్టణ పరిధిలో పలు ప్రాంతాల నుంచి 06 ఫిర్యాదులు రాగా, దీనిలో ప్రజారోగ్య విభాగానికి – 01, ఇంజినీరింగ్ విభాగానికి – 03, పట్టణ ప్రణాళికా విభాగానికి – 02 చెందినవి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ వీటిపై చర్యలు నిమిత్తం సంబందిత అధికారులకు బదిలీ చేశారు. ఈ ఇ - స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాసరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఏ.డి.హెచ్ దామోదర రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.