విశాఖ ఉక్కులో 25 కిలోవాట్ల సౌరవిద్యుత్..
Ens Balu
3
విశాఖ స్టీలు ప్లాంట్
2020-12-01 18:06:57
విశాఖ ఉక్కు 25 కిలోవాట్ల సామర్ధ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్ఇడిసిఎపి) ద్వారా ఏర్పాటు చేస్తోందని స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ కిశోర్ చంద్రదాస్ అన్నారు. ఈమేరకు దీనిని విశాఖ విమల విద్యాలయ స్కూల్ బిసి రోడ్ వద్ద ఏర్పాటు చేస్తుమని ఆయన వివరించారు. దీనికోసం సిఈఆర్ బడ్జెట్ కింద రూ.11.97 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉక్కునగరంలో పాఠశాలల మధ్య సహకారం పెంచుకుంటూ అభివ్రుద్ధి చేసుకోవాలన్నారు. అదే సమయంలో విద్యార్ధులకు మంచి విద్యతోపాటు, క్రమశిక్షణలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఉత్తమ పద్దతులను అనుసరిస్తూ విద్యార్దులకు విద్యాబోధన కూడా చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎపిఎస్ఎస్ఎ, ఎపి ప్రభుత్వం, ఎఫ్కె లక్రా, సిజిఎం (టౌన్ అడ్మిన్), ఆర్ఐఎన్ఎల్, కె. , RINL & ఛైర్మన్-ఎల్ఎంసి వివివి స్కూల్, ఇతర సీనియర్ అధికారులు, డిఎవి పాఠశాల ఉక్కునగరం & వివివి పాఠశాల, ఉక్కునగరం యొక్క సిబ్బంది మరియు ప్రిన్సిపల్స్ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.