సెకెండ్ వేవ్ కరోనాపట్ల అప్రమత్తత అవసరం..


Ens Balu
2
Visakhapatnam
2020-12-05 10:41:50

విశాఖజిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖజిల్లా బిసి సంఘం జిల్లా యువజన మహిళా విభాగం కార్యదర్శి దనుకోటి రమ కోరారు. శనివారం విశాఖలో ఆమె మీడియాలో మాట్లాడుతూ, కరోనా రెండో దశలో పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం చలికాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉన్నందున ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు, ఆరు అడుగులు సామాజిక దూరం పాటించాలన్నారు. నాణ్యమైన శానిటైజర్లు ప్రయాణ సమయంలో దగ్గరుంచుకోవాలని చెప్పారు. శానిటైజర్లు లేనివారు 30 సెకెండ్ల పాటు సబ్బుతో చేతులను పరిశుబ్రంగా కడుక్కోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వైరస్ ను మన దగ్గరకి రానీయకుండా చూసుకోవడానికి వీలుపడుతుందని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, కార్తీక మాసములో చెరువులలోనూ, సముద్రాల్లోనూ సామూహిక స్నానాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అదే సమయంలో దేవాలయాల్లో కూడా సామాజిక దూరం పాటించాలన్నారు. సాధ్యమైనంత వరకూ అవసరం అయితే తప్పా మిగిలిన సమయాల్లో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని ధనుకోటి రమ సూచిస్తున్నారు.