రూ.40వేలు విలువైన గుట్కా స్వాధీనం..
Ens Balu
4
రైల్వేకోడురు
2020-12-05 14:11:19
కడపజిల్లాలో గుట్కాస్థావరాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. శనివారం రాజంపేట సబ్ డివిజన్ లోని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా కేంద్రాలపై దాడులు చేసి రూ.40వేల విలువైన 1125 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సిఐ ఆనందరావు తెలిపారు. ఎస్ఐలు రెడ్డిసురేష్, పెద్ద ఓబన్నల బ్రుందం ఈ గుట్కా స్థావరాలపై దాడులు చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలోనూ, డివిజన్ లో గుట్కా వ్యాపారం గట్టిగా సాగుతుందనే సమాచారంతో దాడులు చేస్తున్నామని, ముందుగా అందిన సమాచారం మేరకు సదరు స్థావరాలపై నా దాడులు చేసినట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో గుట్కాను సీజ్ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్ అభినందించినట్టు సిఐ వివరించారు.