ఆన్లైన్ క్విజ్ పోటీల్లో వరల్డ్ రికార్డ్..
Ens Balu
1
సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ
2020-12-05 14:26:08
ప్రముఖ సైకాలజిస్ట్, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ పరిపాలనాధికారి డా.ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ మరొక ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. భారత దేశం అంతటా లొక్డౌన్ లో ఉన్న కాలంలో విద్యార్థులను ఉత్తేజపరిచి వారి సామర్ధ్యాలను బలోపేతం చేసే ఉద్దేశ్యంతో అత్యధిక ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహించి దేశవ్యాప్తంగా అనేకమంది పాల్గొనే టట్లు చేసి రికార్డు స్రుష్టించారు. దీనితో "వండర్ బుక్ అఫ్ రికార్డు", "జీనియస్ బుక్ అఫ్ రికార్డు" సంస్థలు పరిశీలించి రెండు ప్రపంచ రికార్డులను ప్రధానం చేశాయి. ఈ సందర్భంగా శనివారం విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో విసి ఆచార్య టివి కట్టిమని మాట్లాడుతూ, ఒక మంచి విద్యా కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి తమకు వచ్చిన సమస్యలను అవకాశాలుగా మలచుకోవాలని తద్వారా వాటిని అధిగమించి ఇతరులకు స్ఫూర్తిదాయకం గా నిలవాలని సూచించారు. ప్రపంచ రికార్డు గ్రహీత డా.సూర్యనారాయణ మాట్లాడుతూ “అతి తక్కువ రోజులలో (27 రోజులు) వివిధ సమకాలీన అంశాలలో అతి ఎక్కువ (405 క్విజ్) ఆన్లైన్ క్విజ్ లను 18,802 మందికి నిర్వహించినందుకు గాను తనకు రెండు ప్రపంచ రికార్డులు వచ్చాయన్నారు. ఇటువంటి అంశాలలో ప్రపంచ రికార్డు కోసం ఎవరూ చెయ్యలేదని తానే మొదటి వ్యక్తినని చెప్పారు. అంతముందు విసి టివి కట్టమని ఈయనను అభినందించారు.