ఆంధ్రాలో ముందు రోడ్లు బాగుచేయండి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-05 17:13:41
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు ఒకరికొకరు దూషించుకోవడం మాని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఏపీ బీజేజేపి అధికార ప్రతినిధి సుహాసిని అన్నారు. విశాఖలో శనివారం నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై ఎంవీపీ, టిటిడి కళ్యాణమండపం జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర బిజెవైఎమ్ అధ్యక్షులు సురేంద్రమోహన్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా విజయ ఢంకా మ్రోగిస్తూ ప్రజల పార్టీగా ముద్ర వేసు వేసుకుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ పార్టీ వలన సాధ్యం కాదని అది కేవలం బీజేపీ తోనే సాధ్యం అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రం లో ఉన్న రోడ్ల దుస్థితి బట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలన ఏవిధంగా ఉందో అంచనా వేయవచ్చవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటూరి రవీంద్ర ,బీజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.