విశాఖలో విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం..
Ens Balu
3
విశాఖ ఎయిర్ పోర్టు
2020-12-05 17:31:11
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డికి శనివారం విశాఖలో ఘన స్వాగతం లభించింది. సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాన్ని ముగించుకొని విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఆయనకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. రెండు రోజుల పాటు విశాఖలో ఉత్తరాంధ్రా సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం విశాఖలోని విఎంఆర్డీఏలో జరిగే కార్యక్రమానికి రాజ్యసభ్యులు హాజరవుతారు. తొలుత మూడు ప్రాంతాలకు చెందిన సమావేశాలు పూర్తికావడంలో ఆయన విశాఖ చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీలకర్ర నాగేంద్ర, బీశెట్టి గణేష్, జాన్ ప్రసాద్, గిరి తదితరులు ఉన్నారు.