రూ.1.75 లక్షల అక్రమ మద్యం స్వాధీనం..


Ens Balu
3
Chittoor
2020-12-05 20:11:43

చిత్తూరు పోలీసులు దూకుడు పెంచారు. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం డిఎస్పీ పి.సుధాకరరెడ్డి పర్యవేక్షణలో ఈస్ట్ సిఐ కె.బాలయ్య ఆధ్వర్యంలో బెంగళూరు-తిరుపతి హైవేపై అక్రమంగా తరలిస్తున్న రూ.1.75 లక్షల1104 కర్ణాటక మద్యం బాటిళ్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒక టాటా ఇండికా కారు,ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సిఐ తెలియజేశారు. ఈ దాడుల్లో ఎస్ఐలు ఎన్.విక్రమ్, నాగసౌన్య, సిబ్బంది దయాళ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, అక్రమ మద్యం రవాణా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా సమాచారం అందించవచ్చునని చెప్పిన పోలీసులు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. EB నెం9440900004 కు గాని, డయల్ 100 కు గాని, పోలీసు WHATSAPP నెం9440900005 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు..