వృక్షశాస్త్రంలో శాంతి దేవికి డాక్టరేట్..
Ens Balu
5
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-05 20:42:29
ఆంధ్రవిశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగ పరిశోధకురాలు చికిలే శాంతి దేవికి వర్సిటీ డాక్టరేట్ లభించింది. శనివారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో శాంతి దేవికి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. విభాగ ఆచార్యులు డి.సంధ్యా దీపిక పర్యవేక్షణలో ‘అనాలసిస్ ఆఫ్ వాటర్ టు చెక్ ఇట్స్ ప్రోబబులిటీ ఇన్ టెన్ పంచాయత్స్, ఆప్ అనంతగిరి మండల్, విశాఖపట్నం’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా శాంతి దేవిని విభాగ ఆచార్యులు, పరిశోధకులు అభినందించారు.