అక్షరాన్ని శక్తిగామార్చుకున్న మహావ్యక్తి అంభేద్కర్..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-06 16:33:02
విద్యను అనంత శక్తిగా మార్చుకుని తన భవితను దిద్దుకున్న మహోన్నత వ్యక్తిగా బి.ఆర్ అంబేద్కర్ నిలుస్తారని ఏయూ వీసీ ఆచార్యపి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన జీవితం, విధానాలు నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. విద్యతో దేశం గర్వించే నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా అంబేద్కర్ నిలచారన్నారు. ఆయన జీవితం నుంచి యువత స్ఫూర్తిని పొందాలని సూచించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, కిష్ణమంజరి పవార్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంఘం అద్యక్షులు ఆచార్య పి.అర్జున్, ఆటా అద్యక్షులు ఆచార్య జాలాది రవి, డీన్లు టి.షారోన్ రాజు, ఎన్.సత్యనారాయణ, జి.సుధాకర్, టి.వెంకట క్రిష్ణ, ఎన్.ఏ.డి పాల్, డాక్టర్ కె.ఎస్.ఎన్ మూర్తి, ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు