ప్రభుత్వ విప్ ను కలిసిన ఏఎంసీ ప్రిన్సిపాల్..


Ens Balu
2
Tuni
2020-12-06 17:30:28

ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను తన కార్యాలయంలో ఆంధ్రామెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.సుధాకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ఫగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దాడిశెట్టి రాజా ఆంధ్రామెడికల్ కాలేజీ అభివ్రుద్ధిని, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విప్ దాడిశెట్టిరాజా మాట్లాడుతూ, త్వరలోనే కెజిహెచ్ రూపురేఖలు మారిపోతాయని ప్రిన్సిప్ లకు వివరించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాది రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగానే కెజిహెచ్ లో రోగులకు సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్సులను భర్తీచేసిందన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన పారామెడికల్ పోస్టుల భర్తీ కూడా చేసి ఉత్తరాంధ్రాకే తలమానికంగా కెజిహెచ్ ను ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఏ సమస్య వచ్చినా దానిని తీర్చడానికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.