కళ్యాణ మండపాలు ప్రారంభించిన టిటిడి చైర్మన్..
Ens Balu
2
ప్రకాశం
2020-12-06 20:22:39
ప్రకాశం జిల్లాలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం 2 కళ్యాణ మండపాలను ప్రారంభించి, మరో 2 కళ్యాణ మండపాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఎర్రగొండ పాలెంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం లో రూ. 1.80 కోట్ల తో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాసన సభ్యులు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దంకి నియోజ వర్గం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ వద్ద నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించి, గోశాల, కేశఖండన శాల నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే గరటయ్య, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ రాము, దేవస్థానం ఈఓ శ్రీని వాసరెడ్డి పాల్గొన్నారు. మేదరమిట్ట గ్రామంలో టీటీడీ నిర్మించనున్న కల్యా.మండపానికి సుబ్బారెడ్డి శంఖుస్థాపన చేశారు.