రైతు వ్యతిరేక బిల్లుకి కాంగ్రెస్ మద్దతు..
Ens Balu
1
Visakhapatnam
2020-12-07 14:53:10
కేంద్ర ప్రభుత్వం అనాగరికంగా ఆమోదింపచేసుకున్న రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతుగా రేపు నిర్వహిస్తున్న భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ రోడ్ల మీద లక్షలాదిమంది రైతులు చలిలో వణుకుతూ ధర్నా చేస్తున్నా మోడీ ప్రభుత్వం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని సంకు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఈ బంద్ లో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ బంద్ లో పాల్గొంటారని, విశాఖ ప్రజలు, వ్యాపారస్తులు కూడా అన్నదాతలకు మద్దతుగా బంద్ లో పాల్గొనాలని సంకు విజ్ఞప్తి చేసారు.