విశాఖలో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం..
Ens Balu
2
విశాఖ ఎయిర్ పోర్టు
2020-12-07 17:14:10
భారత ఉప రాష్ట్రపతి ఎం .వెంకయ్య నాయుడుకి విశాఖలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం 10.20 గంటలకు ప్రత్యేక విమానం ఆయన విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన ప్రజాప్రతినిధులు, అధికారులు, బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, పార్లమెంట్ సభ్యులు ఎం .వి.వి.సత్యనారాయణ, బి.వి.సత్యవతి, శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్ మాధవ్, శాసన సభ్యులు పి జి. వి ఆర్ నాయుడు, మాజీ శాసన సభ్యులు పి.విష్ణుకుమార్ రాజు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తదితరులు ఉన్నారు.