పెండింగ్ కార్డులు మ్యాపింగ్ పూర్తిచేయాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-12-07 17:59:13

తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న బియ్యం కార్డుల మ్యాపింగ్ తక్షణమే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.  సోమవారం పౌరసరఫరాల  శాఖ కమిషనర్ కోన శశిధర్ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జేసి లక్ష్మీ శ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ  బియ్యం కార్డుల మ్యాపింగ్ పై సబ్ కలెక్టర్లు, డివిజనల్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు లక్ష 30 వేల బియ్యం కార్డులు పెండింగులో ఉన్నాయని వీటిని వెంటనే పూర్తిచేయాలని ఆయన తెలిపారు. వి ఆర్ వో లాగిన్ లో ఉన్నవి,వాలంట్రీలు లాగిన్ లో ఉన్నవి బియ్యం కార్డు దారుని లొకేషన్ వివరాలు మొబైల్ యాప్ లోవివరాలు నమోదు చేయాలని జేసి తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల డీఎం ఇ. లక్ష్మీ రెడ్డి, డిఎస్ వొ పి. ప్రసాదరావు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.