విఎస్ఎస్ భూములకు హక్కుపట్టాలు..ప్రవీణ్ ప్రకాష్


Ens Balu
2
Visakhapatnam
2020-08-04 18:01:54

విశాఖ మన్యంలోని వనసంరక్షణ సమితి భూములకు అటవీ హ క్కుప త్రాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సి పల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. మంగళవారం చింత పల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వనసం రక్షణ సమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి పేదరికాన్ని నిర్ములిం చాలని సూచించారు. సిరిపురం గ్రామం నుంచి కొండపైకి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తోటలు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. వి ఎస్ ఎస్ లలో సాగుచేసిన కాఫీ తోటలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. అటవీ భూములు, వి ఎస్ ఎస్ లలో సాగుచేసి మరణించిన వారి వారసులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని స్పష్టంచేశారు. సిరిపురం గ్రామంలో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పట్టాలు సిద్ధం చేసారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన రైతులకు సిల్వర్ మొక్కలు, కాఫీ మొక్కలు సరఫరా చేయాలని చెప్పారు. కాఫీ తోటలు ,మిరియాలసాగు పై వస్తున్న పంట దిగుబడి, ఆదాయాన్ని, రైతులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి పంచాయతి కందులగాది వి ఎస్ ఎస్ తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల, పిసిసి ఎఫ్ ప్రతీప్ కుమార్, విశాఖపట్నం సి ఎఫ్ పి.రామ్మోహనరావు, ఏ పి సిసి ఎఫ్ ప్రత్యేకాధికారి ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఏ కె ఝా తదితరులు పాల్గొన్నారు.