శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరయం మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం స్ధానిక అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా మంచి సౌకర్యాలతో ఆడిటోరియాన్ని రూపొందించాలని ఇండనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణాలు జరిగిన తరువాత క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్కడ తేడా వచ్చినా సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇ.డబ్ల్యు.ఐ.డి.సి. కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర రావు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.