విమ్స్ లో వసతుల విస్తరణ:కలెక్టర్ వి.వినయ్ చంద్


Ens Balu
3
VIMS
2020-08-06 20:21:57

విశాఖపట్నం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసు పత్రిలో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టరు అధికారు లను ఆదేశించారు. గురువారం ఆయన విన్స్ ఆసుపత్రిని సంద ర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్, ఇతర అధికారులు, వైద్యులతో ఆయన సమావేశ మయ్యారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వాటిని మెరుగుప రచడం గూర్చి ఆయన సమీక్షించారు. రానున్న కాలంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశమున్నందున, ముందు జాగ్రత్తగా అందుకు అవసరమైన వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేస్తున్న సేవలు వసతులను మరింత మెరుగు పరచుకోవాలి అన్నారు. ఆసుపత్రిలో గల వసతులను, సేవలను పూర్తి స్థాయిలో వినియో గించుకొనుటకు గాను అవసరమైన సిబ్బందిని నియమిం చుకోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి బెడ్డుకు ఆక్సిజన్ అందే విధంగా పరికరాలను అమర్చాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంటు ఆరోగ్య పరిస్థితిని వెంటనే పరీక్షించి, అందించవలసిన చికిత్సను నిర్దారించాలన్నారు. ఈ సమావేశంలో విమ్స్ డైరెక్టరు సత్యవరప్రసాదు, ప్రత్యేక ఉప కలక్టరు సూర్యకళ, జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.తిరుపతిరావు, డా. చలం, డా. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.