ఏయూ సిఎస్ఓగా మహమ్మద్ ఖాన్..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-15 21:59:01
ఆంధ్రవిశ్వవిద్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సిఎస్ఓ)గా విశ్రాంత ఏడిసిపి మహమ్మద్ ఖాన్ నియమితులయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తన నియామక ఉత్తర్వులను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి స్వీకరించారు. వర్సిటీ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఆస్థులు పరిరక్షణ పటిష్టం చేయడం సాధ్యపడుతుందనాన్ర. విశ్వవిద్యాలయంలో పూర్తిస్తాయిలో బద్రత చర్యలు చేపట్టాలని సిఎస్ఓకు సూచించారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ నుంచి సిఎస్ఓగా ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. రూసా 2.0 పథకంలో భాగంగా వర్సిటీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. దీనిలో భాగంగా విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాన్ను నియమించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తెలిపారు. విశ్వవిద్యాలయం ఆస్థుల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషిచేస్తానని సిఎస్ఓగా నియమితులైన మహమ్మద్ ఖాన్ తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.