ఉదారతను చాటిన ఎంపీ ఎంవీవీ సత్యన్నాయణ..


Ens Balu
2
2020-08-07 16:50:29

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన ఉదారతను చాటారు. విశాఖలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నెలలు నిండకుండా జన్మించి న ఓ పసిబిడ్డకు బాసటగా నిలిచారు .పూర్తిగా రూపాంతరం చెందని అవయవాలతో తక్కువ బరువుతో ఆ పసిబిడ్డ జన్మించ డంతో వెంటిలేటర్ మీద చికిత్స అనివార్యమైంది.ఈ క్రమంలో ఆసుపత్రి ఖర్చులు లక్ష పైబడి కావడంతో కైలాసపురం ప్రాంతానికి చెందిన ముత్యాల గౌరి శంకరరావు దంపతులు ఎంపీ ని ఆశ్రయిం చారు. తక్షణమే స్పందించిన ఎంవీవీ క్రెడాయ్ సహాయం తో రూ.1లక్ష చెక్ ను లా సన్స్ బేకోలనీ పార్టీ ఆఫీస్ లో అందజేశారు .ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ పీలా కోటేశ్వరరావు ,అధ్యక్షులు బి .శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.