ఘనంగా వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు..
Ens Balu
1
విశాఖపట్నం
2020-12-16 22:26:18
వైఎస్.షర్మిల ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి మహిళలకు చేదోడుగా ఉండాలని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలోని బుధవారం పార్టీకార్యాలయంలో వైఎస్సార్సీపీ సౌత్ ఎలక్షన్ ఇన్చార్జి గొంపభాను ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ కేక్ ని కట్ చేసి షర్మికు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనో రాష్ట్రం శుభిక్షంగా ఉందని, షర్మిలమ్మ కూడా ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తే మరింతగా మహిళలకు దగ్గరగా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గొంపభాను మాట్లాడుతూ, రాష్ట్రంలో జగనన్న వదిలిన భాణంగా విశాఖలో షర్మిలమ్మ పాదయాత్ర చేసిన సమయంలో మహిళలకు ఆమె ఎంతగానో చేరువయ్యారన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ వస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు మహిళా కార్యకర్తలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు గాజులను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.