ఘనంగా పెన్షనర్ దినోత్సవం..
Ens Balu
3
శ్రీకాకుళం
2020-12-17 21:11:47
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో రెవిన్యూ పోలీసు సంఘాలు సంయుక్తంగా పెన్షనర్స్ డే సంధర్భంగా శ్రీకాకుళం ఆర్ అండ్ బి. అతిధి గృహం వద్ద గల శాంతా అనురాగ ఆనందనిలయంలో గురువారం ఉదయం పెన్షనర్స్ దినోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సంధర్భంగా జిల్లాపెన్షనర్స్ అధ్యక్షులు వీరభద్రస్వామి, రెవిన్యూ పెన్షనర్స్అధ్యక్షులు మోహనరావు పోలీస్ సంఘాధ్యక్షులు రామారావు జాతీయ పెన్షనర్ల అసోసియేషన్ ఆవశ్యకతను, అసోసియేషన్ ఆవిర్భావానికి చేసిన కృషిని గుర్తు చేసారు. పెన్షనర్ నకారా అవిరళ కృషి, సుప్రీం కోర్టు న్యాయవాది జస్టిస్ చంద్ర చూడ్ తీర్పు పెన్షనర్లకు వరదానమని వారికి జీవితాంతం ఋణపడి వుంటామని సభ్యులందరూ వ్యక్త పరిచారు. ఈ సంధర్భంగా విశ్రాంత డి.ఈ.వో. బి.మల్లేశ్వర రావు, విశ్రాంత రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పి.యం.జె.బాబు, రిటైర్డ్ ఏ.ఆర్.యస్.ఐ. అప్పారావు లకు సన్మానం చేసారు. సన్మాన గ్రహీతలు పెన్షనర్ సంఘాలకు ధన్యవాదాలు తెల్పుతూ సంఘాలు ఐక మత్యంతో కలసికట్టుగా వుండి పెన్షనర్ల డిమాండ్లను సాధించు కోవాలని తెలిపారు. మరియు ప్రభుత్వం నుండి జీతభత్యాలు, పెన్షన్లు తీసుకుంటున్న ప్రజా ప్రతి నిధుల నుండి వసూలు ఇన్ కం టాక్స్ వసూలు చేయటం లేదని, అదే విధంగా పెన్షనర్ల నుండి వసూలు చేస్తున్న ఇన్ కం టాక్సు రద్దు కోసం ఐకమత్యంగా పోరాడి సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కే.సోమసుందర్, యం.యస్.ఆర్.ఎస్. ప్రకాశరావు. నరశింహమూర్తి. డీ.పి.దేవ్. రమణ, బి.జయమ్మ. సత్యవతి మరియు అధిక సంఖ్యలో పెన్షనర్లు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు.