20 న ఏపి సెట్-2020 పరీక్ష..


Ens Balu
4
Nellore
2020-12-18 20:45:57

ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హత, పదోన్నతుల కోసం నిర్వహించే 'ఏపీసెట్-2020 ను రాష్ట్రవ్యాప్తముగా  ఈ నెల 20 వ తారీఖున  నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలో  'ఏపీసెట్-2020' నిర్వహించే బాధ్యతలను జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి అప్పగించారు.  'ఏపీసెట్-2020' పరీక్ష రీజినల్ సమన్వయ అధికారిణి గా ఆచార్య సుజా ఎస్ నాయర్ నియమించారు.  జిల్లాలో మొత్తం నాల్గు సెంటర్లలో, మొత్తం 1753 మంది హాజరు కానున్నారు. నగర లోని  DKW కాలేజి, కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ , VR ఇన్స్టిట్యూట్ అఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ మరియు కాకుటూరులోని విశ్వవిద్యాలయ కళాశాలలో ఈ పరీక్ష  నిర్వహించించునట్లు సమన్వకర్త ఆచార్య సుజా ఎస్ నాయర్ తెలిపారు.  పేపర్-1లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి, పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారని  అన్నారు. పరీక్ష ఉదయం 9గం. 30 నిమిషాల ముంచి మధ్యాహ్నం 12 గం 30 నిమిషాల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు OMR పత్రములో సమాదానాలు గుర్తించాల్సివుంటుందని అన్నారు. అలాగే ఎటువంటి నెగటివేమార్కింగ్ లేదని తెలిపారు. అభ్యర్థులు తప్పక మాస్క్ ధరించి రావాలని అలాగే త్రాగు నీరు కూడా వారే తెచ్చుకోవాలని తెలియచేసారు. అభ్యర్థులను ఉదయం 8 గం నుంచి పరీక్షా ప్రాంగణములోనికి అనుమతిస్తారని 9 గం  30 నిమిషాల తర్వాత అనుమతి ఉండదని అన్నారు.   ఈ సందర్భముగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు  సమన్వయ అధికారిణి సుజా ఎస్ నాయర్ తో పరీక్షలు పకడ్బందీగా మరియు సురక్సితముగా నిర్హహించాలని సూచించారు.