ప్రజలకే సేవచేయడమే నిజమైన సంత్రుప్తి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-19 19:10:03

విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం  వీర మహిళ తెలుగు లక్ష్మి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ బొడ్డేపల్లి రఘు పాల్గొన్నారు. వృద్ధులకు మహిళలకు పళ్ళు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ, జనసేన సిద్ధాంతాల్ని పాటించే మొట్టమొదటి మహిళ తెలుగు లక్ష్మి అన్నారు. దక్షిణ నియోజకవర్గం లో మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి అనికొనియాడారు. జనసేన వీరమహిళ తెలుగు లక్ష్మి మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. ప్రజలకు తమవంతుగా అన్ని రకాల సేవలు అందిస్తామన్నారు. జన్మదిన వేడుకలకయ్యే ఖర్చును మొత్తం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు అర్జున్. మూగి  శ్రీనివాస్, జీకే, సురేష్, గణేష్, బాలు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.