ఇళ్ల స్థలాల లేఅవుట్లు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
2
Anantapur
2020-12-19 19:39:14
పేదల కోసం ప్రభుత్వం రూపొందించిన నూతనఇళ్ల స్థలాల లేఔట్లను సత్వరం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని కురుగుంట గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 62 ఎకరాల లో ఇళ్ల స్థలాలు లేఔట్లను, తాటిచర్ల లోని, ,13 ఎకరాలు లేఔట్లను,పొడరాళ్ల నందు ఇంటి స్థలాలకు సంబంధించిన 5 ఎకరాల , లేఔట్లను, బుక్కరాయసముద్రం మండలంలోని సిద్ధరాంపురం, పసలూరు నందు ఇంటి స్థలాలకు సంబంధించిన 34. ఎకరాల 18 సెంట్లకు కు సంబంధించిన నూతన లే ఔట్లు ఇంటి స్థలాలు సంబంధించిన పనులను ఎలా జరుగుతున్నాయో పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు అభివృద్ధి) నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలతో లేఅవుట్ను రూపొందించినట్లు మున్సిపల్ కమిషనర్ వి వి ఎస్ ఎన్ మూర్తి వివిధ లేఔట్ల కు సంబంధించిన ప్లాను,కలెక్టర్కు వివరించారు. ఇళ్ల స్థలాల సంబంధించిన లేఔట్లను పూర్తిగా చదును చేసి, సరిహద్దులకు సంబంధించిన రాళ్లను నాటాలి.పిచ్చిమొక్కలను తొలగించాలని అలాగే అంతర్గతంగా గ్రావెల్ రోడ్లను వేయాలని, లేఔట్లను బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని వసతులతో లేఔట్లను పూర్తి హంగులతో సిద్దం చేయాలని ఈ నెల 23వ తేదీ లోపల పనులు వేగవంతం గా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లాకలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్, అనంతపురం ఇన్చార్జి తాసిల్దార్సిల్దార్ లు , లక్ష్మీ నారాయణ రెడ్డి, బుక్కరాయసముద్రం తాసిల్దార్ మహబూబ్ బాషా సర్వేలు ప్రతాప్. మున్సిపల్ శాఖ ప్లానింగ్ అధికారులు , సర్వే శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.