ఏపి సెట్కు 73.96% హాజరు..
Ens Balu
2
Visakhapatnam
2020-12-20 15:57:26
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్ 2020ని ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. విశాఖలోని పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును ప్రత్యక్షంగా గమనించి, పరీక్ష సమర్ధవంతంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఏపిసెట్ ప్రవేశ పరీక్షకు 35,862 మంది దరఖాస్తు చేయగా 26,525 మంది హాజరవగా 9337 మంది గైర్హాజరు అయ్యారు. ఏపిసెట్ ప్రవేశ పరీక్షకు 73.96 శాతం హాజరు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాల ఉదయం 9.30 నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పరీక్ష నిర్వహణ జరిపినట్లు ఏపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు తెలిపారు.