భువనేశ్వరి కుటుంబానికి న్యాయం చేస్తాం..
Ens Balu
3
ఒంగోలు
2020-12-20 18:41:12
సజీవ దహనమైన వికలాంగ యువతి, వాలంటీర్ భువనేశ్వరి కుటుంబానికి న్యాయం చేస్తామని ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఒంగోలు ఆమె కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా చైర్ పర్శన్ మాట్లాడుతూ, ఈ ఘటన పై కూలంకుషంగా విచారణ జరపాలని జిల్లా పోలీసు అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. అంతేకాకుండా విచారణ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకు వెళతామని భువనేశ్వరి కుటుంబానికి పూర్తి అండగా నిలుస్తామని వాసిరెడ్డి పద్మ భరోసా ఇచ్చారు. పాక్షికంగా వికలాంగురాలైన భువనేశ్వరి అక్క కు పూర్తి మెరుగైన వైద్యం అందే విధంగా చూస్తామని, ఈమేరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను కోరనున్నట్టు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్న ఆమె ఈ తరహా సంఘటనలు మరోసా జరగకుండా చర్యులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.