రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేష్ కుమార్ రెడ్డి..


Ens Balu
4
Vijayawada
2020-12-20 19:26:46

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీఈఎంజేఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రకాశం జిల్లా ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి స్టాఫ్ రిపోర్టర్ కె.వి. సురేష్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్సులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్ లు హాజరయ్యారు. నూతన కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ కుమార్ రెడ్డిని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు అలుగుల సురేష్, శేషసాయి, ఏపీఈఎంజేఏ జిల్లా అధ్యక్షుడు టీవీ రావు, ఎంసీఏ అధ్యక్షుడు ఇఫ్తికర్, జిల్లాలోని వివిధ ఛానళ్ల స్టాఫ్ రిపోర్టర్లు కె.శ్రీనివాసరావు, జయరాం, మురళి, మండవ ప్రసాద్, బొడ్డు శ్రీను తదితరులు అభినందించారు.