శ్రీకాకుళంలో స్పందన కి 25 వినతులు..


Ens Balu
4
Srikakulam
2020-12-21 20:57:29

శ్రీకాకుళం జిల్లాలో స్పందన కార్యక్రమానికి 25 వినతులు వచ్చాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తెలిపారు.  సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు సంబంధించి 8 వినతులు,  పౌర సరఫరాల శాఖకు సంబంధించి 5 వినతులు,  ఇతర శాఖలకు  సంబంధించి 12 వినతులు వచ్చాయని తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన మేరకు నేరుగా కాకుండా ఆలన్ లైన్, ఫోన్ లైన్ ద్వారా స్పందన నిర్వహించినట్టు చెప్పారు.  ప్రజలు చేసుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్టు డిఆర్వో వివరించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్  నుండి జె.చలమయ్య,  స్పందన విభాగం  సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.