దేశంలో తిరుగులేని సీఎం వైఎస్ జగన్..
Ens Balu
1
Visakhapatnam
2020-12-21 22:40:17
జగనన్న ఆలోచనా విధానం నిజమైన అభివృద్ధికి తార్కాణమని కే ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, 32వ వార్డ్ వైఎస్సార్సీపీ నాయకుడు కందుల నాగరాజు అన్నారు. సోమవారం ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మ దినం సందర్భంగా వార్డ్ లో జన్మదిన వేడుకలు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల,కార్యకర్తల కేరింతల మధ్య కేక్ ఎస్ కే సలీం తో కలిసి కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు మాట్లాడుతూ, జగన్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ జనాదరణ కలిగాయని,ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు చేరువ చేసిన ఘనత జగన్ కె దక్కుతుందన్నారు.జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని,జగన్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని,నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నాగరాజు ఆకాంక్షించారు.అనంతరం మహిళలకు,వృద్దులకు పేదలకు దుప్పట్లు,పండ్లు,మిఠాయిలు పంపిణీ చేసారు.ఈ వేడుకల్లో రమేష్,నీలబాబు,సూరి,అశోక్,లారా,మేరీ,చిన్నమ్మలు,విజయ,రసూల్ తదితరులు పాల్గొన్నారు.