ఫిబ్రవరి 14న ఎన్.టి.ఎస్.ఇ స్టేజ్-2 పరీక్ష
Ens Balu
1
Srikakulam
2020-12-22 18:52:20
శ్రీకాకుళం జిల్లాలో జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (NTSE) స్టేజ్- 2 పరీక్ష ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నవంబరు 2019 లో జరిగిన జాతీయ ప్రతిభాన్వేషణ రాష్ట్ర స్థాయి (స్టేజ్ -1) పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జాతీయ స్థాయి స్టేజ్ -2 పరీక్ష 2021 ఫిబ్రవరి 14న విశాఖపట్నంలో జరుగుతుందన్నారు. ఈ పరీక్ష కేంద్రం (ఎక్సమినేషన్ సెంటర్) మార్చుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ నెల 28 లోగా ntsexam.ncert@nic.in అనే ఈ మెయిల్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఈ.ఆర్.టీ) వారికి తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు. పూర్తి వివరములకు ఎన్.సి.ఈ.ఆర్.టీ వెబ్ సైటు www.ncert.nic.in ను సంప్రదించవచ్చని ఆమె వివరించారు.