ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతం కావాలి..
Ens Balu
1
Anantapur
2020-12-22 19:45:11
అనంతపురం జిల్లాలో డిసెంబర్ 25 తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఆర్డీవోలు తహశీల్దార్లు మున్సిపల్ కమిషనర్లతో ఇళ్ల పట్టాల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పవిత్ర కార్యక్రమంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 25వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అధికారులందరూ నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక అజెండాలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కాలనీలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.అందుకు అనుగుణంగా లబ్ధిదారులకు లాటరీలలో కేటాయించిన విధంగానే ఏ ఫ్లాట్ లో ఉన్న లబ్ధిదారులు ఆ ఫ్లాట్లోనే ఇళ్లు కట్టుకునేలా చూడాలన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్ కాకుండా ఇతర ఫ్లాట్ లకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అన్ని మండలాలకు ఇళ్ల పట్టాలను పంపించడం జరిగిందన్నారు.ఆ పట్టాలలో జిల్లా పేరు, మండలం ,గ్రామానికి సంబంధించిన వివరాలను ముందుగానే ఒక సీల్ రూపంలో సిద్ధం చేసుకోవాలన్నారు .లబ్దిదారులకు అందించే ఇంటి పట్టాలకు సంబంధించిన కొలతలు చదరపు గజాల లో ఉండాలన్నారు. దాంతోపాటు బ్రాకెట్లలో చదరపు అడుగులు కూడా పొందుపరచాలన్నారు.అలాగే నివేశపు లే అవుట్ నెంబరు, ఆర్ ఎస్ ఆర్ నెంబరు, బ్లాక్ మరియు ఫ్లాట్ నెంబరు ఇందులో పొందు పర చాలన్నారు. లబ్ధిదారుని పట్టాలకు సంబంధించి పట్టా కట్టడడం నకు ముందు వెనక వైపు సెట్ బాక్ అడుగుల స్థల వివరాలతో సహా పూర్తిగా పొందుపరచాలన్నారు.
పట్టాలలో తాసిల్దార్ సంతకము, తేదీ, సీల్,అలాగే ఫోటోపై కూడా తాసిల్దార్ సంతకం చేయాలన్నారు. పట్టాలలో సర్వే నంబరు ,లేఅవుట్ నెంబరు తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. అందులో లబ్ధిదారులకు ఇంటి పట్టాల సరిహద్దుల వివరాలు మరియు కొలతలు కూడా పొందుపరచాలన్నారు. ఇదివరకే రూపొందించిన లేఅవుట్లలో మొక్కల పెంపకాన్ని శ్రద్ధగా చేపట్టాలన్నారు. వాటికి ట్రీగార్డులను అమర్చాలన్నారు. ఇళ్ల పట్టాలకై దరఖాస్తు చేసుకున్న 90 రోజుల పూర్తయిన వారికి డిసెంబర్ 25వ తేదీ నాటికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు.ప్రజా ప్రతినిధులను సంప్రదించి ఇళ్ల పట్టాలకు సంబంధించి రోజువారీ పంపిణీ చేసే షెడ్యూల్ వివరాలను రేపటి సాయంత్రం లోగా తనకు పంపించాలని కలెక్టర్ సూచించారు .ప్రతి లేఔట్ వద్ద లబ్ధిదారుల జాబితాను ,వారి ప్లాట్ నెంబరు, చిరునామాలతో సహా ప్లెక్సీ రూపంలో రూపొందించి ప్రదర్శించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ,రెవెన్యూ గ్రామాల వారీగా పట్టాలను వేరుచేసి ఉంచాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి పట్టాలను పంపడం జరుగుతుందన్నారు .అందుకు సంబంధించి సిబ్బందిని అందుబాటులో ఉంచుకుని వెంటనే వాటిలో వివరాలు పొందుపరచాలన్నారు. ఇందుకోసం సచివాలయంలోని సిబ్బందిని ఉపయోగించుకోవలసిందిగా ఆయన సూచించారు. అందిన పట్టాలలో వివరాలన్నింటినీ పరిశీలించుకోవాలన్నారు.అనర్హుల జాబితాలో ఉన్న పేర్లతో పట్టాలు వస్తే వాటిని కలెక్టరేట్లోని ఈ సెక్షన్ కు పంపాలన్నారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వరప్రసాద్, హౌసింగ్ పిడి వెంకటేశ్వర్ రెడ్డి ,నగరపాలక సంస్థ కమిషనర్ పి వి విఎస్ మూర్తి ,తదితరులు పాల్గొన్నారు.