అడిషనల్ కమిషనర్ టీచరైన వేళ..
Ens Balu
2
Visakhapatnam
2020-12-22 20:02:20
ఉన్నతాధికారులు ఏ ప్రభుత్వ శాఖను తనిఖీ చేస్తే ఆ శాఖలోకి పరకాయ ప్రవేశం చేస్తేనే అక్కడి లోపాలు తెలుస్తాయ్.. ఎక్కడికి వెళ్లినా..ఏ సమస్యనైనా నిశితంగా పరిశీలించి పరిష్కరించడంలో జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుది ప్రత్యేక శైలి. ఈ క్రమంలోనే మంగళవారం 11వ వార్డులోని మున్సిపల్ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఒక్కసారిగా ఉపాధ్యాయుడిగా మారిపోయారు. అక్కడి పిల్లలకు పాఠ్యాంశాలు బోధిస్తూ.. ఇతర ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు ఎలా చెబుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సన్నివేశంతో విద్యార్ధులు ఒక్కసారిగా తమకు కొత్త ఉపాధ్యాయ అధికారి వచ్చారా అంటూ కాస్త సందిగ్దంలో పడ్డారు. అదేసమయంలో తాను జీవిఎంసీ అధికారినని చెప్పడంతో విద్యార్ధులంతా వారి సమస్యలను, విద్యావిధానాన్ని అదనపు కమిషనర్ కి వివరించారు. ఈ సన్నివేశం చూస్తున్న మీడియాకి ఈ అధికారి ఏ శాఖ సమస్యలు తెలుసుకోవాలో ఆ శాఖను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఈ విధంగా చేస్తారా అనే బ్రమ కల్పించారు. ఈ తరహా ఆకస్మిక తనిఖీల వలన ఎంతో ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు సన్యాసిరావు. దానికోసమే ఈ విధంగా వారి స్టైల్ లోనే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారాయన. అనంతరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాలలో జరుగుచున్న నాడు – నేడు పనుల పురోగతిని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తిచేయుటకు గాను సంబందిత అధికారులతో ప్రతీ రోజూ చర్చించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత వాతావరణం గమనించి శానిటరీ ఇన్ స్పెక్టరు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పాఠశాలలో ప్రతీ రోజూ శుభ్రం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టరు, ప్రధానోపాధ్యాయుని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన క్రమం తప్పకుండా పాటించాలని అప్పుడే విద్యార్ధులు క్రమశిక్షణతో పాఠశాలలో మెలుగుతారని ఉపాధ్యాయులకు సూచించారు. పదవ తరగతి చదువుచున్న విద్యార్ధిని, విద్యార్ధులను ప్రశ్నిస్తూ ఉపాద్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలుపై అవగాహన గూర్చి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని పరీక్షలలో ఉన్నత ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు, జివిఎంసికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్ధినీ విద్యార్ధులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, 11వ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టరు తదితరులు పాల్గొన్నారు.