కనకమ్మను దర్శించిన మంత్రి కుటుంబం..


Ens Balu
1
Visakhapatnam
2020-12-23 16:07:14

విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది , క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కుటుంబ సమేతంగా  బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాలభిషేఖం  చేసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు  కుటుంబ సభ్యులతో సహా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.  ఆలయ అధికారులు ప్రసాదాలు , చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జ్యోతి మాధురి, ఏఈవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ.. ప్రజలందరూ అమ్మ  ఆశీస్సులతో సంతోషంగా, ఆరోగ్యాలతో ఉండాలన్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు.