సీఎం పర్యటనను విజయవంతం చేయండి..
Ens Balu
2
Tirupati
2020-12-23 16:11:29
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఈనెల 28 న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు వద్ద పంపిణీ చేసే ఇంటిపట్టాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ డా.ఎస్.భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్, జెసి లు , ఉన్నతాధికారులు సభా స్థలం లో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించి, అనంతరం శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హెలిపాడ్ ఏర్పాటు, సభాస్థలికి లబ్ధిదారుల రాక , పార్కింగ్, రోడ్లు, పైలాన్ పరిశీలన ఇతర ఏర్పాట్లపై సంబందిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 28 న సభాస్థలికి ఉదయం 10:45 కు చేరుకొని ఇంటి పట్టాల పంపిణీ చేయనున్న స్థలంలో ఏర్పాటు చేసిన శిలాపలకాన్ని ప్రారంబించి, ప్రక్కనే ఏర్పాటు చేసిన సభా వేదిక చేరుకొని లబ్ధిదారుల నుద్దేశించి ప్రసంగించనున్నారని, అనంతరం ఇంటిపట్టాలను పంపిణీ చేసి మద్యాహ్నం 1:30 గంటలకు లోపు కార్యక్రమం ముగింపు కావచ్చని తెలిపారు. రేణిగుంట , ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో 16 వేల మంది లబ్దిదారులు వున్నారని, వారు ముఖ్యమంత్రి సభకు రానున్నారని తెలిపారు. 160 ఎకరాలలో వేసిన లేఔట్ల నుండి లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల 60 వేలమందికి ఇవ్వనున్న ఇంటి పట్టాల కోసం భూసేకరణ 1850 ఎకరాలు అతితక్కువ ధర రూ.370 కోట్లతో జరిగిందని వివరించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (డి) వీరబ్రహ్మం, జెసి 2 రాజశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్ తిరుపతి ఆర్డిఓ కనకనరసా రెడ్డి, తహసీల్దార్ జరీనా, హౌసింగ్ పి.డి. పద్మనాభం, పోలీస్ , పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి అధికారులు, అనధికారులు ఉన్నారు.