జాతీయ కమిషన్ సభ్యుల పర్యటన..
Ens Balu
2
Chittoor
2020-12-23 18:34:18
జాతీయ బి.సి కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు ఈ నెల 24,25 వ తేదిలలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త చెప్పారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ బి.సి కమిషన్ గౌరవ మెంబర్ ఈ నెల 24 వ తేది గురువారం ఉ. 11.05 ని.లకు తిరుపతి అతిధి గృహo చేరుకుని మ. 12 గం.లకు వివిధ పిటిషన్ లపైన జిల్లా కలెక్టర్, ఎస్.పి, ఆర్.డి.ఓ, బి.సి.వెల్ఫేర్ డిస్పార్ట్మెంట్ మరియు ఇతర సంబందిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలోని National Sanskrit University వైస్ చాన్సలర్, రిజిష్ట్రార్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మ 2.30 గంటలకు ఎస్.వి యూనివర్సిటి లోని కాన్ఫరెన్స్ హాల్ చేరుకొని ఆంధ్రప్రదేశ్ బి.సి.వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్, యూనివర్శిటి బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమీక్షా సమావేశం, తదుపరి అదే సమావేశ మందిరం నందు సా.3.30 గంటలకు ఎస్.వి.యూనివర్శిటి వైస్ ఛాన్సలర్, రిజిష్ట్రార్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గం. తిరుమల చేరుకొని రాత్రి బస చేస్తారు. 25 వ తేది శుక్రవారం ఉ. 5 గంటలకు శ్రీవారిని దర్శించుకొని తిరుపతి అతిథి గృహం చేరుకుని ఉ. 8గం.లకు టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఉ.9.30 గం.లకు తిరుపతి అతిథి గృహం నుండి బయలుదేరి ఉ.11.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.