పోలీసుకుటుంబానికి నష్టపరిహారం అందజేత..
Ens Balu
2
Nellore
2020-12-23 18:50:42
పోలీసుల కుటంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధినిర్వహణలో అనారోగ్యంతో మ్రుతిచెందిన హోంగార్డు లక్ష్మణ్ కుటుంబానికి రూ.4,12,510 నష్టపరిహారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు జాగ్రత్తతోనే వుంటుందన్నారు. అయినప్పటికీ లక్ష్మణ్ అనారోగ్యంతో మ్రుతిచెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పోలీసుశాఖ తోడు వుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తమను కలవాల్సిందిగా ఎస్పీ బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.