ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్..
Ens Balu
2
Kadapa Airport
2020-12-23 19:03:54
వైయస్ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , విప్ కొరుముట్ల శ్రీనివాసులు , ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి , రఘురామి రెడ్డి , మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , ఎమ్మెల్సీ జకియా , కత్తి నరసింహ రెడ్డి , మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి , స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.