విజయనగరంలో 420 కేజిల గంజాయి స్వాధీనం..
Ens Balu
3
విజయనగరం
2020-12-23 21:00:16
విశాఖపట్నం నుంచి ఒడిశా సంబల్ పూర్ కు అక్రమంగా తరలిస్తున్న 420 కేజిల గంజాయిని విజయనగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం గంజాయి లోడోతో ఒక లారీ ఒడిసాకి వెళుతున్నట్టు సమాచారం అందుకున్న డిఎస్పీ అనిల్ పులిపాటి తన బ్రుందంతో దాడిచేసి మార్గమధ్యలోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గంజాయి రవాణాపై నిఘా వుంచామని, ఈ క్రమంలోనే రావాణ అవుతున్న గంజాయి సమాచారాన్ని తెలుసుకొని దాడులు చేశామన్నారు. వారి దగ్గర నుంచి గంజాయి ట్రేలను స్వాధీనం చేసుకోవడంతోపాటు బీహార్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ దాడుల్లో విజయనగరం రూరల్ సిఐ మంగవేణి, మురళి, ఎస్ఐలు కిరణ్, దేవి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని విజయనగరం ఎస్పీ రాజకుమారి అభినందించారు.