దేవుని పిలుపుమేరకు నడుచుకోవాలి..


Ens Balu
3
Vijayawada
2020-12-23 21:10:24

 క్రిస్టమస్ సందేశం కేవలం శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు, దేవుని సందేశం మేరకు మనము నడుస్తున్నామా అనే విషయం  ప్రతి ఒక్కరం  మననం చేసుకోవాల ని క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయ రైతు శిక్షణా కేంద్రంలో బుధవారం సాయంత్రం సెమి క్రిస్టమస్ వేడుకలు జిల్లా యంత్రంగం ఘనంగా నిర్వహిం చింది. కరోనా సమయంలో అన్ని ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు మూసివుంచి మనకు మనమే ఆలోచించాల్సిన పరిస్థితి రేకెత్తించాయి అన్నారు. దేవుని వాక్యాలు ప్రతి ఒక్కరం గుర్తుంచు కోవాలన్నారు. ప్రతి ఒక్కరు భగవంతుని వ్యాఖ్యలు తప్పకుండా మననం చేసుకోవాలన్నారు. నేనే  నిజం అన్న ప్రభువు వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి . ప్రేమ , సమానత్వం ప్రతి ఒక్కరిపై చూపాలన్నారు .  దేవునిపై నమ్మకం ఉన్నవారు మాత్రమే దేవునిని చేరుకోగలమని పేర్కొన్నారు. క ఖురాన్ లో జీసస్ క్రీస్తు ప్రస్తావన పలు మార్లు వొచ్చిందన్నారు. ఖురాన్ లో మరియం పేరుతో ఒక చాప్టర్ ప్రత్యేకంగా వుందన్నారు.. మనం ఏమిటి అని తెలుసుకొని, అన్నార్తులకు , దివ్యాంగులకు, వెనుకబడిన వారికోసం ఆలోచించాల్సి ఉందన్నారు. అదే ప్రేమ సౌబ్రాతుత్వా నికి సూచికగా క్రిస్టమస్ వేడుకలు నిలుస్తూ యని పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబాలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రము లోని బలహీన వర్గాలు , వెనుకబడిన వర్గాలు కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. క్రెస్తవుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.  పామర్రు శాసన సభ్యులు కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ , క్రీస్టమస్ వేడుకలు సమయంలో క్రీస్తు మన కోసం శిలువ వేసుకొని , మనందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు . కరోనా సమయంలో మనందరినీ కాపాడి ఈ రోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల మతాలకు రాజకీయ లకు అతీతంగా అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో కలెక్టర్ చేపట్టిన కార్యక్రమాలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా కాండిల్ లైట్ నిర్వహించారు. పలువురు దేవుని వాక్యాలు వినిపించారు.ఈ సమావేశంలో రెవేరండ్ మేజర్ ఐ డి ఎబెనజెర్,  డా కె .జోసెఫ్ మోసెస్, ఫాదర్ మువ్వాలా ప్రసాద్ , రేవ్. ఐ.కరుణానిధి , నోవెల్ శామ్యూల్, డా వై బాబు, యేసుపాదం, బి దయానందం, ఎం.విజయరావు, అధికారులు  ఎండి రియాజ్ సుల్తాన్, జి రవీంద్ర, మురళి, జి జూన్ మోషే, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.