శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్..


Ens Balu
1
Visakhapatnam
2020-12-24 12:41:16

శాంతి, సంతోషానికి చిహ్నంగా  క్రిస్మస్ పండుగ నిలుస్తుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మానవ కళ్యాణం కోసం ఏసుక్రీస్తు జన్మించాడని ,ఆయన జననం ఈ ప్రపంచానికి శాంతి సంతోషాలు, మోక్ష భాగ్యాలను కలిగించిందని ఈపండుగ సందర్భంగా ఆయన జిల్లాలోని క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు,వారి కుటుంబ సభ్యులకు, పాస్టర్లకు, క్రైస్తవ విశ్వాసులకు  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవులంతా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ మానవులకు మోక్షం, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.     ప్రేమ, త్యాగం, సహనం, శాంతికి ప్రతీకగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.  కరోనా వైరస్ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ ప్రార్థనల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చర్చిలలో ప్రార్థనలు నిర్వహించే సమయంలో భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.