శ్రీ కనకమహాలక్ష్మికి గంట్ల ప్రత్యేక పూజలు..


Ens Balu
2
విశాఖపట్నం
2020-12-24 14:30:31

మార్గశిర మాసోత్సవం సందర్భంగా  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం విశాఖలోని అమ్మవారి దేవస్థానంలో శ్రీనుబాబు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల కష్టాలు తొలగి శుభిక్షంగా ఉండేలా చూడమని కనకమహాలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. తన సేవలు పూర్తిగా జర్నలిస్టులకే అంకితమని చెప్పారు. ధనుర్మాసంలో అమ్మవారి దర్శనం అపురూపంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇటీవలే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంలోని పెద్దలకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. అటు ప్రభుత్వం నుంచి జర్నలిస్టుల పట్ల సానుకూల స్పందనే వుందని శ్రీనుబాబు వివరించారు.