బిసిలకు ఉన్నత స్థానం సీఎం జగన్ చలవే..


Ens Balu
4
Visakhapatnam
2020-12-24 16:34:25

తూర్పు కాపుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. గురువారం విశాఖలో అయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి  బీసీలను గుర్తించి కార్పేరషన్లు ఏర్పాటు చేశారన్నారు. సీఎం జగన్ ఆశయాలమేరకు పనిచేస్తూ కాపుల అభ్యున్నతికి క్రుషి చేస్తానని అన్నారు. 56  కార్పొరేషన్లు ఏర్పాటుచేసి 56 మందిని చైర్మన్లుగా,672  మందిని డైరెక్టర్లుగా నియమించిన చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్య వైద్య,ఉపాధి తదితర అంశాలపై ద్రుష్టి సారిస్తామన్నారు. త్వరలోనే కార్పొరేషన్ కు కావలసిన నిధులు విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పధకాలు అందరికీ చేరేలా కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. బీసీలు చిరకాలం జగన్ మోహన్ రెడ్డి మేలు మర్చిపోలేరన్నారు. తమ కులానికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్లు,కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని చైర్మను సత్కరించారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.