జీవిఎంసీ డయల్ యువర్ కమిషనర్ కి 17 ఫిర్యాదులు


Ens Balu
2
Visakhapatnam
2020-08-10 18:21:32

జి.వి.ఎం.సి.లో సోమవారం నిర్వహించిన  డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17 ఫోన్ కాల్స్ వచ్చాయని ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ మంగపతి రావు చెప్పారు.  టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుండి ఈ కార్యక్రమం  నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03,    2వ జోనుకు సంబందించి 03,  3వ జోనుకు సంబందించి 02, 4వ జోనుకు సంబందించి 01,  5వ జోనుకు సంబందించి 01, 6వ జోనుకు సంబందించి 06, అనకాపల్లి జోనుకు సంబందించి 01, మొత్తము 17 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు.  ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులతో పాటూ, స్పందన కార్యక్రమాలలో స్వీకరించిన ఫిర్యాదులు, మున్సిపల్ పరిపాలన శాఖ వెబ్ సైట్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి, వి. సన్యాసి రావు,               సి.సి.పి. విద్యుల్లత, డి.సి.ఆర్. ఫణిరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు
సిఫార్సు